0

ఫాదర్స్ డే రోజు " బ్రా "కొంటే 15% డిస్కౌంట్


హైదరాబాద్: ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా న్యూస్ పేపర్లలో ప్రముఖ లోదుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్ వివాదాస్పదం అయింది. ఈ యాడ్ చెత్తగా ఉందంటూ మెగా హీరోయిన్ పూజా హెడ్గే(ముకుంద ఫేం) మండి పడింది. బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్(భాగ్ మిల్ఖా భాగ్ ఫే), నటుడు రిషి కపూర్, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ యాడ్ మీద నిప్పులు కక్కారు. 

మహిళల బ్రా, ఇతర లోదుస్తులు తయారు చేసే "Triump" బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ ఇది. 1886లో స్థాపించిన ఈ ఇంటర్నేషనల్ కంపెనీ జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా పత్రికల్లో 15% డిస్కౌంట్ అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. ‘తమ తండ్రులచే గారాబం చేయబడే లేడీస్ కోసం 15% సేవింగ్స్. జూన్ 21న(ఫాదర్స్ డే) మాత్రమే ఈ ఆఫర్' అంటూ ప్రకటన ఇచ్చింది.


ఈ బ్రా యాడ్ చెత్తగా ఉందని పూజా హెడ్గే ట్విట్టర్ ద్వారా మండి పడింది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ యాడ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనతో పాటు రిషి కపూర్, స్వర భాస్కర్, ఇతర ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ యాడ్ మీద మండి పడ్డారు. తండ్రి కూతుళ్ల అనుబంధానికి మచ్చ తెచ్చే విధంగా ఈ యాడ్ ఉందంటూ పలువురు ఆగ్రమం వ్యక్తం చేసారు.






Previous
Next Post »