0

రాక్షసబల్లులు ఇంకా బతికే ఉన్నాయి..!

dinosaur-and-fish
జురాసిక్ యుగంలో ఎప్పుడో 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన జీవులు రాక్షస బల్లులు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అవి భారీ ఆకారాలతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తీవ్రమైన ఆహార కొరత, ఏక ఖండగా ఉన్న భూమి క్రమంగా ఖండాలుగా విడిపోవడంతో పాటు ఉల్కాపాతం కారణంగా చాలా వరకు అవి అంతరించిపోయాయి. ఇక, డార్విన్ చెప్పినట్టు ఆయా జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరిగింది. ఆ పోరాటంలో బలమైన జీవులు బతికి బట్టగట్టగా, మిగిలినవి వాటికి ఆహారంగా మారిపోయాయి.
అయితే, కొన్ని జీవులు అప్పటి పరిస్థితును తప్పించుకునేందుకు ఎగరడం మొదలుపెట్టిగా.. అవి ఆర్కియాప్టరిక్స్ పక్షులుగా రూపాంతరం చెందాయి. కొన్ని నీటిలో ఈదటం మొదలు పెట్టి రే రే ఫిన్ ఫిష్ గా మార్పు చెందాయని తెలుస్తున్నది. రే ఫిన్ ఫిష్ లపై జరిపిన పరిశోధనలు బట్టి వాటి పూర్వికులు రాక్షస బల్లులే అని తేలింది. రే ఫిన్ ఫిష్ యొక్క పంటిపై శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు జరిపారు. సముద్రంలో ఉండే గోల్డ్ ఫిష్ నుంచి ట్యూనా చేపల వరకు రే ఫిన్ ఫిష్ జాతికి చెందినవే అని వారు తెలియజేస్తున్నారు. ఎప్పుడో అంతరించిపోయిన రాక్షస బల్లులు ఇప్పుడు చేపల రూపంలో బతికున్నాయని దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది.


Previous
Next Post »